జక్రాన్పల్లి: మండలంలోని కలిగోట్ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థిని కృతిక జాతీయ స్థాయి యూత్ వాలీబాల్ పోటీలకు ఎంపికై న ట్లు పీఈటీ యాదగిరి తెలిపారు. ఈ నెల 14 నుంచి 20 వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నిర్వహించే జాతీయ స్థాయి యూత్ వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు పీఈటీ పేర్కొన్నారు. కృతిక ఎంపికపై వాలీబాల్ సర్పంచ్ నాయిక రాజు, ఉపసర్పంచ్ సత్తెమ్మ, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశ్గౌడ్, హెచ్ఎం పురుషోత్తమాచారి, ఉపాధ్యాయులు, వీడీసీ సభ్యులు అభినందించారు.


