రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Oct 1 2025 10:49 AM | Updated on Oct 1 2025 10:49 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి కుక్కల దాడిలో 17 మందికి గాయాలు పేకాట స్థావరంపై పోలీసుల దాడి

మాక్లూర్‌: అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ఓ యువకుడు బైక్‌పై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన మండలంలోని మాదాపూర్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మాక్లూర్‌ ఎస్సై రాజశేఖర్‌ కథనం మేరకు... నందిపేట మండలం వెల్మల్‌ గ్రామానికి చెందిన మద్దెపల్లి మోహన్‌ (44) ద్విచక్ర వాహనంపై రాత్రి 7 గంటలకు పని నిమిత్తం నిజామాబాద్‌ వెళుతున్నాడు. మాదాపూర్‌ గ్రామం వద్ద పాడి గేదెలను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావటంతో మోహన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చిన్నారి పరిస్థితి విషమం

ఆర్మూర్‌ టౌన్‌: ఆర్మూర్‌ పట్టణంలోని రాజారాంనగర్‌ శివారు ప్రాంతం, వెంకటేశ్వర కాలనీ, ఔటిగల్లీల్లో పిచ్చికుక్కల స్వైరవిహారం చేశాయి. మంగళవారం సుమారు 17 మందిపై దాడి చేశాయి. క్షతగాత్రులకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స నిర్వహించారు. కాగా, ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

మాక్లూర్‌ : మండలంలోని కొత్తపల్లి శివారులో ఉన్న ఓ మామిడి తోటలో పేకాట స్థావరంపై మంగళవారం సాయంత్రం ఎస్సై రాజశేఖర్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది దాడి చేశారు. పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని రూ.4,620 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement