పథకాలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలపై అవగాహన కల్పించాలి

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ● అధికారులతో సమీక్ష జిల్లా మహిళా సంఘాలకు ఇటీవల రాష్ట్ర స్థాయి అవార్డులు లభించినందుకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ను ఆ శాఖ ఉ ద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వారిని శాలు వాలతో సన్మానించి అభినందించారు. అధికారులు, సిబ్బంది చేసిన కృషిని కొనియాడారు. మున్ముందు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడపాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విజయలక్ష్మి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

8x5

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను గ్రామసభల్లో వెల్లడించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్‌, జెడ్పీ సీఈవో గోవింద్‌, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళా సంఘాలకు అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement