కాజీపేట–మంచిర్యాల–బల్లార్షా మీదుగా వెళ్తున్న లైన్లపై భారం, హైదరాబాద్–నాగపూర్–ఢిల్లీల మధ్య దూరాన్ని తగ్గించడానికి నిర్మల్ మీదుగా రైల్వేలైన్ వ్యూహాత్మక అవసరం. దీనిని త్వరగా పూర్తిచేయాలని ఇటీవలే రైల్వేమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చాం.
– సిర్గాపూర్ నిరంజన్రెడ్డి,
రాజ్యసభ ఎంపీ
రైలు కోసం ఎదురుచూపులు
నిర్మల్ మీదుగా రైలు వస్తుందని కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు కేంద్రంపై కొంత ఒత్తిడి తీసుకువచ్చి రైల్వేలైన్ నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేలా చూడాలని కోరుతున్నాం.
– ఎంసీ లింగన్న, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


