మంచిర్యాలటౌన్: కేంద్ర ఎన్నికల సంఘం రా ష్ట్రంలో చేపట్టే ప్రత్యేక ఓటరు సవరణ(సర్)లో బీజేపీ కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అ న్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూ రి వెంకటేశ్వర్గౌడ్తో కలిసి జిల్లా పదాధికారులు, సీనియర్, మండల నాయకులతో సమావే శం నిర్వహించారు. ఆయన మాట్లాడతూ కేంద్ర ఎన్నికల సంఘం 2002 తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా సర్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలి పారు. బీజేపీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్ను నియమించి తప్పులు లేని ఓటరు జాబితా కోసం కృషి చేయాలని అన్నారు.


