బాసర: ఆర్జీయూకేటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచకొండ విగ్నేష్, దిగంబర్ అన్నారు. విద్యార్థులు పేర్కొన్న 12 డిమాండ్లు నెరవేర్చాలని ఆర్జీయూకేటీ మెయిన్ గేట్ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇప్పటికీ లాప్టాప్ అందించకపోవడం బాధాకరమని అన్నారు. 10 వేల మంది విద్యార్థులు ఉండే యూనివర్సిటీలో ఆరుగురు వైద్యసిబ్బంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర యూనివర్సిటీల కోకన్వీనర్ చక్రి, అక్షయ్, సాంకేత్ తదితరులు పాల్గొన్నారు.


