
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్టౌన్: అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదు లు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలను తె లుసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలి గించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూ చించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీ సుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు.