శ్రమించారు.. సాధించారు | - | Sakshi
Sakshi News home page

శ్రమించారు.. సాధించారు

Sep 29 2025 8:45 AM | Updated on Sep 29 2025 8:45 AM

శ్రమి

శ్రమించారు.. సాధించారు

జిల్లా కేంద్రంలోని గాయత్రీ టౌ న్‌షిప్‌ కాలనీకి చెందిన లింగాల విజయలక్ష్మి–గోపాల్‌ దంపతుల చిన్న కుమారుడైన హరికృష్ణ గ్రూప్‌–2 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి పంచాయతీరాజ్‌ శాఖలో ఎంపీవోగా ఎంపికయ్యారు. వ్య వసాయ కుటుంబ నేపథ్యం కలిగిన హరికృష్ణ పాఠశాల విద్యను జిల్లా కేంద్రంలోని విజయ హైస్కూల్‌లో, ఇంటర్‌, బీటెక్‌ హైదరాబాద్‌లో చదివారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, తన అన్న డాక్టర్‌ సాయికృష్ణ ప్రేరణతోనే ఉద్యోగం సాధించినట్లు హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణను కుటుంబీకులు, కాలనీవాసులు అభినందించారు.

నిర్మల్‌ఖిల్లా: లక్ష్యం దిశగా శ్రమిస్తే స్వప్నం సాకారమవుతుంది. జిల్లా కేంద్రానికి చెందిన జసింత్‌ జో యల్‌ ఇందుకు నిదర్శనం. కరుణ–డేనియల్‌ దంపతుల పెద్ద కుమారుడు జసింత్‌ జోయల్‌ గ్రూప్‌–1 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బీసీ ‘సీ’ కేటగిరీలో రాష్ట్రస్థాయి తొలి ర్యాంక్‌ కై వసం చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఆసిఫాబాద్‌ డిప్యూటీ కలెక్టర్‌గా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. జోయల్‌ ఎనిమిదో తరగతి వరకు స్థానిక సెయింట్‌ థామస్‌ పాఠశాలలో, 9–10 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలోగల కేకేఆర్‌ గౌతం స్కూల్‌లో, ఇంటర్‌ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో, బీటెక్‌ తమిళనాడులోని వెల్లూరులో పూర్తి చేశారు. అనంతరం బీహెచ్‌ఈఎల్‌లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి తర్వాత నాలుగేళ్లుగా సివిల్స్‌ కోసం సన్నద్ధమవుతున్నారు. నిత్యం 18గంటలకు పైగా పుస్తకాలతో కుస్తీపట్టి శ్రమించారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచారు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇతని తల్లి కరుణ సారంగపూర్‌ మండలం ధని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా, తండ్రి డేనియల్‌ జిల్లాకేంద్రంలోని గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యంగా పురోగమిస్తున్నట్లు జోయల్‌ తెలిపారు. జోయల్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.

మూడేళ్ల కష్టం.. ఎంపీవో ఉద్యోగం

శ్రమించారు.. సాధించారు 1
1/1

శ్రమించారు.. సాధించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement