భీమన్న ఆలయం ఆక్రమణపై ఎస్పీకి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

భీమన్న ఆలయం ఆక్రమణపై ఎస్పీకి ఫిర్యాదు

Oct 1 2025 10:47 AM | Updated on Oct 1 2025 10:47 AM

భీమన్న ఆలయం ఆక్రమణపై ఎస్పీకి ఫిర్యాదు

భీమన్న ఆలయం ఆక్రమణపై ఎస్పీకి ఫిర్యాదు

నిర్మల్‌టౌన్‌: మామడ మండలం పోతారం గ్రామంలో ఆదివాసీ నాయక్‌పోడ్‌ల ఆరాధ్య దైవం భీమన్న ఆలయాన్ని గిరిజనేతరులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య తెలిపారు. ఈ విషయంపై ఎస్పీ జానకీ షర్మిలకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసుల కులదైవం భీమన్న ఆలయాన్ని ఆక్రమించడం తమ సంస్కృతి ,సంప్రదాయాలను ధ్వంసం చేయడమే అవుతుందని మండిపడ్డారు. ఈ దౌర్జన్యంపై అధికా రులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంచు శ్రీనివాస్‌, ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement