క్రైస్తవుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

క్రైస్తవుల సంక్షేమానికి కృషి

Sep 20 2025 6:58 AM | Updated on Sep 20 2025 6:58 AM

క్రైస్తవుల సంక్షేమానికి కృషి

క్రైస్తవుల సంక్షేమానికి కృషి

● రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ దీపక్‌జాన్‌

నిర్మల్‌ఖిల్లా: అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన క్రైస్తవ మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ దీపక్‌జాన్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో క్రైస్తవ మైనారిటీల సమస్యలపై కలెక్టర్‌ అభిలాష అభినవ్‌తో కలిసి శుక్రవారం సమీక్షించారు. జిల్లాలో చర్చిల నిర్మాణాల కోసం స్థలాల కేటాయింపు, కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణం, క్రైస్తవులకు కుల, వివాహ ధ్రువీకరణ పత్రాల జారీ, సమాధుల కోసం స్థలాల కేటాయింపు తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈమేరకు సిఫారసులు ప్రభుత్వానికి పంపుతామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ మాట్లాడుతూ.. క్రైస్తవ మైనార్టీల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు తమ సమస్యలను కమిషన్‌ చైర్మన్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌, చైర్మన్‌ను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్‌సింగ్‌, అసోసియేట్‌ పాస్ట ర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement