
ఓబీసీలు అస్తిత్వాన్ని కాపాడుకోవాలి
నిర్మల్ఖిల్లా: ఓబీసీల సమస్యలపై దృష్టిసారించి అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పెన్షనర్స్ భవన్ సమావేశ మందిరంలో బుధవారం బీసీ సంఘాల నాయకులతో కలిసి ‘ఓ బీసీల పోరుబాట’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారి, మ ధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్సింగ్ ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. పుస్తకంలో ఓబీసీల వెనుకబాటు, కులవృత్తులపై జరి గిన సామాజిక ఆర్థిక దోపిడీ, ఓబీసీ కమిషన్ల చారిత్రక పరిణామాలు, రిజర్వేషన్లు, సమకాలి న ఓబీసీ స్థితిగతుల విశ్లేషణ ఉంటుందని వివరించారు. ఓబీసీలు సంఘటితమైతేనే ఆశించి న ప్రయోజనాలు సాధించుకోవచ్చని తెలిపా రు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, బీజేపీ నాయకుడు రావుల రాంనాథ్, జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు నరేంద్రబాబు, రాష్ట్ర ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు స్వదేశ్ తదితరులు పాల్గొన్నారు.