ఐక్యంగా ముందుకెళ్దాం | - | Sakshi
Sakshi News home page

ఐక్యంగా ముందుకెళ్దాం

Jun 13 2025 4:57 AM | Updated on Jun 13 2025 4:57 AM

ఐక్యంగా ముందుకెళ్దాం

ఐక్యంగా ముందుకెళ్దాం

నిర్మల్‌టౌన్‌: క్రిస్టియన్లు అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలని నేషనల్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్‌ సంజయ్‌ఆనంద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చి సమీపంలోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌లో నేషనల్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో క్రిస్టియన్‌ కమ్యూనిటీకి గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. పాస్టర్లు, చర్చిలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఎన్‌సీసీ అందరికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎన్‌సీసీ అధ్యక్షుడిగా ప్రభాకర్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జనరల్‌ సెక్రెటరీ ఏలియా, క్రిస్టియన్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement