
ఐక్యంగా ముందుకెళ్దాం
నిర్మల్టౌన్: క్రిస్టియన్లు అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ సంజయ్ఆనంద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి సమీపంలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ కమ్యూనిటీకి గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. పాస్టర్లు, చర్చిలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఎన్సీసీ అందరికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎన్సీసీ అధ్యక్షుడిగా ప్రభాకర్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ ఏలియా, క్రిస్టియన్లు పాల్గొన్నారు.