
పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ
నిర్మల్టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, పోలీస్ స్టేషన్లో లేదా మీసేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 88 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో శుక్రవారం వాటిని అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మార్కెట్లో చౌకగా వస్తుందని, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసి చెక్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 1,416 ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐటీ కోర్, వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.