నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 14 2025 10:06 AM | Updated on Jun 14 2025 10:06 AM

నిర్మ

నిర్మల్‌

ఆటపాటల బడి.. అంగన్‌వాడీ
మహిళా, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘అమ్మ మాట–అంగన్‌వాడీ బాట’ పేరిట ఈనెల 10 నుంచి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రక్తదానం.. ప్రాణదానం

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

9లోu

శనివారం శ్రీ 14 శ్రీ జూన్‌ శ్రీ 2025

8లోu

ఇన్‌చార్జి మంత్రిని కలిసిన డీసీసీ అధ్యక్షుడు

నిర్మల్‌చైన్‌గేట్‌: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని కాంగ్రెస్‌ కండువాతో సత్కరించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఇన్‌చార్జి మంత్రి సూచించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్‌ నియోజకవర్గ నాయకులు ఉన్నారు

దిగో.. ఇది ఇంకో ముచ్చట. ‘గొలుసుకట్టు’ను తెంపేస్తూ చెరువులనే చెరబట్టే కథ. ఇక్కడ కూడా ఫస్ట్‌ ఫొటోను చూడండి. ఇది జిల్లాకేంద్రంలోనే మల్లన్నగుట్ట హరిహరక్షేత్రం ఎదురుగా మొన్నటిదాకా ఉన్న ఓ పేద్దకుంట. అవును పెద్దదిగా ఉండేది.. ఇప్పుడది చిన్న గుంతలా మారిపోయింది. కాదు మార్చేశారు. గొల్లపేట చెరువు అలుగు ఈ కుంటలో చేరి, ఇక్కడి నుంచి ఇబ్రహీం చెరువులోకి నీళ్లు వెళ్లేలా ‘గొలుసుకట్టు’ విధానంలో భాగమైన కుంట ఇది. కొంతమంది స్థానికులు బతుకమ్మ కుంటగానూ పిలుస్తుంటారు.

నిర్మల్‌: ‘మాది రాయల్‌ నిర్మల్‌.. మస్తుంటది..’ అంటూ చాలామంది గొప్పలు చెబుతుంటారు. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలతో ముచ్చట్లు పె డుతుంటారు. కానీ.. రియల్‌గా నిర్మల్‌ నిమ్మలంగా లేదన్నది వాస్తవం. రాష్ట్రంలోనే కబ్జాలకు పెట్టింది పేరుగా నిర్మల్‌ పేరు మార్మోగుతోంది. గొలుసుక ట్టు చెరువులు, కాలువలు, కందకాలు, చివరకు ప్ర భుత్వ స్థలాలు, పురావస్తు కట్టడాలు దేన్నీ విడిచి పె ట్టకుండా చెరబడుతున్నారు. మారుమూల సందుల్లోనే కాదు.. సాక్షాత్తు అందరూ చూసే ప్రధాన రహ దారుల పక్కనే ఆక్రమణలు కొనసాగుతున్నాయి.

ఆక్రమణలో చరిత్ర ఆనవాళ్లు..!

రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అణువణువునా నిమ్మలలో చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. కానీ.. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నారు. చరిత్రకు సమాధి కట్టేస్తున్నారు.

● అంతటా.. పాతబావులంటూ పాడుబడినవాటిని తవ్వి, పర్యాటక ప్రదేశాలు చేస్తున్నారు. ఇక్కడేమో అంతా ఉల్టాపల్టా.. మంచిగా ఉన్న పాతకాలం బావులను పూడ్చేస్తున్నారు.

● సర్ద్‌మహల్‌కు నీటినందించే ఏనుగులబావిని నామరూపాలు లేకుండా చెత్తతో నింపేస్తున్నారు. పాతగ్రంథాలయం, ఫైర్‌ స్టేషన్‌ వెనుక, మున్సిపల్‌ నుంచి ఈద్‌గాం వెళ్లేదారిలో గల ఈబావి చాలా పెద్దగా ఉండేది. దాన్నిప్పుడు మొత్తం మున్సిపల్‌ చెత్తతో పూడ్చేస్తున్నారు. ఇదే అదనుగా అక్కడ క్రమంగా ఆక్రమణలకు అడుగులు పడుతున్నాయి.

● సమీకృత మార్కెట్‌.. పేరు చెప్పి ఒకప్పటి చారిత్రక భవనమైన అర్బన్‌ తహసీల్‌ కార్యాలయాన్ని కూల్చేశారు. ఇంతటితో ఆగకుండా దానివెనుకే.. ఒకప్పటి అద్భుత నిర్మాణమైన సరస్సునూ పూడ్చేశారు. సమీకృత మార్కెటు నిర్మాణానికి కనీసం అడుగు కూడా ముందుకు పడటం లేదు. కానీ.. ఈ ఖాళీ జాగాపై ఆక్రమణల కన్నుపడుతోంది.

● ప్రియదర్శినినగర్‌లో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వెనుక ఉన్న గజ్‌గఢ్‌ చుట్టూ ఉన్న కందకాన్ని ఇప్పటికే మట్టితో నింపేసి ఆక్రమించేశారు. గ తంలో ‘సాక్షి’ వరుస కథనాలు రాయడంతో అప్పటి కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి స్పందించి ట్రెంచ్‌ కొ ట్టించడంతో కొంతభాగం కందకం మిగిలింది.

● చారిత్రక చైన్‌గేట్‌కు ఇరువైపులా ఒకప్పటి చారిత్రక కందకం నామరూపాలు లేకుండా పోతోంది. జీవోల పేర్లు చెప్పి ఇప్పటికే ఓ దిక్కు కందకాన్ని సగానికి పైగా ఆక్రమించారు. మరోదిక్కూ అదే తరహా కబ్జా కొనసాగుతోంది.

● బంగల్‌పేట్‌ శివారులో ఉన్న బురుజులన్నీ కబ్జాలకు గురవుతున్నాయి.

● ఎక్కడా ఉండని మరో విచిత్రమైన విషయమేంటే.. చుట్టూ బలమైన, ఎత్తయిన రాతిగోడ కట్టడం ఉన్న శ్యాంగఢ్‌ లోపల కొందరికి పట్టాభూములు ఉండటం.

మున్సిపల్‌ స్థలాలూ..

అవీ ఇవీ అని తేడా లేకుండా కబ్జాల కొనసాగుతున్నాయి. సర్కారు జాగాల్లోనూ పాగా వేస్తున్నారు. పట్టణాన్నీ చూసుకోవాల్సిన మున్సిపల్‌లోనే దొంగ ఇంటినంబర్లు ఇస్తూ.. ఈ కబ్జాలకు ప్రోత్సాహమిస్తున్నారు. గుట్టలు, పురావస్తు కట్టడాల్లోనూ ఇళ్లను కట్టేస్తున్నారు. అసలు బల్దియా.. తన ఆస్తులనే కాపాడుకోలేని స్థితికి చేరుతోంది. ఒకప్పుడు కమిషనర్‌ ఉండేందుకు ఉన్న క్వార్టర్‌ను కూల్చేశారు. ఆ స్థలానికి కనీసం ఫెన్సింగ్‌ కూడా పెట్టలేదు. ఇప్పటికే పలుచోట్ల కందకాలు, కాలువల్లో ఆక్రమణలు చేయడంతో మురుగునీరుకూ దారి లేకుండా పోయింది. అందుకే ప్రతీ వానాకాలం ప్రధాన రహదారి, శివాజీచౌక్‌లు నీటమునుగుతున్నాయి. ఏళ్లుగా ముంపు ముంచేస్తున్నా.. కబ్జాలపై మాత్రం చర్యలు కనిపించడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు సకాలంలో స్పందించకపోతే.. ఊరికంటూ ఏదీ మిగలదని నిర్మల్‌వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

జిల్లా కేంద్రంలో ఆగని ఆక్రమణలు

ప్రభుత్వ స్థలాల్లోనే అక్రమ పాగాలు

పురావస్తు ఆస్తులూ.. అన్యాక్రాంతం

సర్కారు జాగాలకు ‘ఇంటి నంబర్లు’

ఇక.. ఈ ఫొటో చూస్తే సిన్మా అర్థమవుతుంది. రెండేళ్ల కిందట పెద్దగా ఉన్న కుంట ఇప్పుడిలా అయింది. ఇంకో విషయం అలుగును డ్రైనేజీ లెక్క కట్టేసి చెరువులకు విడిచిపెట్టారు. అంటే.. రేపొద్దున ఇక్కడ ఇళ్లు కట్టుకుంటే, ఆ ఇళ్ల డ్రైనేజీ నీళ్లన్నీ చెరువులకు పోవాల్సిందే.

చర్యలు చేపడుతున్నాం..

నిర్మల్‌ మున్సిపాలిటీ పరిధిలోని స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పలుచోట్ల అక్రమ కట్టడాలను తొలగించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పురాతన కట్టడాల పరిరక్షణ చర్యలు చేపడతాం.

– జగదీశ్వర్‌గౌడ్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, నిర్మల్‌

నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement