
గ్రామాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే
నిర్మల్చైన్గేట్: వాతావరణ మార్పులతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని డీఎంహెచ్వో రాజేందర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని గ్రామాల్లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో వైద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులు అధికంగా ప్రబలినచోట ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నిర్వహణ అధికారులు డాక్టర్ ఆశిష్రెడ్డి, డాక్టర్ సౌమ్య, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, డీపీవో రామచందర్ జిల్లాలోని వైద్యాధికారులు పాల్గొన్నారు.