
ఘనంగా వటసావిత్రి వ్రతం
నిర్మల్ఖిల్లా: వటసావిత్రి వ్రతం సందర్భంగా బుధవారం ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాకేంద్రం సమీపంలో శ్రీగిరి క్షేత్రంలో ఏరువాక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వట సావిత్రి వ్రతం నిర్వహించి గురుమాత రాజరాజేశ్వరీదేవి, ఆర్కారి రాజవ్వ వ్రతం నేపథ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి హాజరై పూజలు చేశారు. గురుస్వామి శనిగారపు చిన్నయ్య, సముందర్పల్లి కిషన్, గణేశ్, దినేశ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న మహిళలు