
ఉత్సాహంగా బడికి..
నిర్మల్
● వినూత్నంగా విద్యార్థులకు స్వాగతం ● యూనిఫాంలు, పుస్తకాలు అందించిన అదనపు కలెక్టర్, ఆర్జేడీ
శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2025
పునరావాస సమస్యలు పరిష్కరిస్తాం
కడెం: కవ్వాల్ పునరావాస గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్డీవో వేణుబాబు అన్నారు. డిమాండ్లను పరిష్కరించాలని పాత గ్రామాలకు తరలివెళ్లిన రాంపూర్, మైసంపేట్ వాసులతో గురువారం మాట్లాడారు. వారి డిమాండ్లు తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని కొత్తమద్దిపడగ సమీపంలోని పునరావాస కాలనీని, సాగు భూములను పరిశీలించారు.
నిర్మల్ రూరల్: నూతన విద్యా సంవత్సరం గురువారం ఉత్సాహంగా ప్రారంభమైంది. జిల్లాలోని ప్ర భుత్వ, ప్రైవేటు పాఠశాలలను మామిడి తోరణాలతో సుందరంగా అలంకరించారు. పాఠశాలలన్నీ పండుగ వాతావరణంలో ప్రారంభించారు. తొలి రోజు తమ తల్లిదండ్రులతో విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు పూలు, బెలూన్లు అందించి సాదరంగా, వినూత్నంగా స్వాగతం పలికారు. ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు పూల మొక్కలు అందించి తరగతి గదిలోకి ఆహ్వానం పలికారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థులు పూర్తిస్థాయిలో హాస్టళ్లకు చేరుకోలేదు. ఉదయం పూట వర్షం పడడంతో జిల్లావ్యాప్తంగా తొలిరోజు విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. గ్రామాల్లో ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
యూనిఫాం, పుస్తకాల పంపిణీ...
విద్యా సంవత్సరం తొలిరోజు అధికారులు విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి మామడ మండలంలోని కొరటికల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల, మామడ కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాం, నోటుబుక్కులు అందించారు. డీఈవో రామారావు నిర్మల్ మండలం తల్వేద ప్రాథమిక పాఠశాల, మామడ మండలం సంతోష్ నగర్ ప్రాథమిక పాఠశాల, జిల్లా కేంద్రంలోని కురన్నపేటలో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు అందించారు.
తొలిరోజు 55 శాతం హాజరు..
జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 55.25 శాతం మంది విద్యార్థులు బడులకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 48,563 మంది విద్యార్థులు చదువుతుండగా, 26,830 మంది హాజరయ్యారు. శుక్ర, శనివారాల్లో విద్యార్థుల హాజరు శాతం మెరుగవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రైవేటుకు దీటుగా విద్య
సర్కారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లాలో 23 పాఠశాలలను ఎంపిక చేశారు.
8లోu
న్యూస్రీల్

ఉత్సాహంగా బడికి..

ఉత్సాహంగా బడికి..

ఉత్సాహంగా బడికి..

ఉత్సాహంగా బడికి..

ఉత్సాహంగా బడికి..