
పిల్లలను బాల కార్మికులుగా మార్చొద్దు
ముధోల్: బడీడు పిల్లలను బాలకార్మికులుగా మార్చవద్దని, 14 ఏళ్లలోపు పిల్లలను బడిలో చేర్పించాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాసమితి ప్రధాన కార్యదర్శి రాధిక అన్నారు. మండలంలోని తరోడా ప్రాథమిక పాఠశాలలో గురువారం నిర్వహించిన బాల కార్మికుల నిర్మూలన దినోత్సవంలో మాట్లాడారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనికి పంపకుండా బడికి పంపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. కార్యక్రమంలో ముధోల్ ఎస్సై బిట్లా పెర్సీస్, మండల విద్యాధికారి రమణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు నీలిమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.