
బడిని బతికించిన పెద్దసారు..
కడెం: మండలంలోని ఎలగడప ప్రభుత్వ పాఠశాల మూతబడే స్థితి నుంచి పూర్వవైభవాన్ని నిలబెట్టుకుంటోంది. గతేడాది ఐదుగురే విద్యార్థులుండగా గత జూలైలో బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయుడు కూచనపెల్లి శ్రీనివాస్ బడిని ఎలాగైనా బతికించాలనుకున్నారు. గ్రామస్తుల సహకారంతో విద్యార్థుల సంఖ్య 5నుంచి 25 పెంచారు. వేసవి సెలవుల్లోనూ శ్రీనివాస్ గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రవేశాల పెంపునకు కృషి చేశారు. ఈనెల 6నుంచి బడిబాట నిర్వహించి 45మంది విద్యార్థులను చేర్పించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 68కు చేరింది.