
వాతావరణం
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం పూర్తిగా మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముంది.
భూ ఆక్రమణలపై ఫిర్యాదు
ఖానాపూర్: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరైన అధి కారులకు తిమ్మాపూర్ పరిధిలో పలుచోట్ల జరి గిన భూఆక్రమణలపై పట్టణవాసులు ఫిర్యా దు చేశారు. తిమ్మాపూర్ శివారులోని సాయిబా బా ఆలయ సమీపంలోగల ఫారెస్ట్ కాంట్రాక్ట ర్స్ అసోసియేషన్కు చెందిన భూమికి జారీ చే సిన పట్టాదారు పాస్బుక్ రద్దు చేయాలని తి మ్మాపూర్ వీడీసీ నాయకులు కోరారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని భూమిని ఖానాపూర్ పరిధిలోని పలు కు లసంఘాలకు కేటాయించగా ఆక్రమణకు పా ల్పడుతున్నారని తెలిపారు. దీనిపై విచారణ చే పట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, స త్తన్పల్లి గ్రామంలో తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ స దస్సులో 57, స్థానిక రెవెన్యూ కార్యాలయ ఆ వరణలో సీనియర్ అసిస్టెంట్ సబిత ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 49 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్ఐలు సత్యనారాయణ, నాగేశ్ తెలిపారు. నాయకులు బీసీ రాజన్న, స తీశ్రావు, కొత్తపెల్లి సురేశ్, మైలారపు గంగాధర్, నేతశ్యాం, లాండేరి కిషన్, అప్కారి నర్స య్య, దాసరి భీమన్న, ద్యావతి రాజేశ్వర్, బీసీ రమేశ్, మంత్రరాజం దేవేందర్ ఉన్నారు.