నిర్మల్
గురువారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2025
దేశ విధానాలు
ప్రపంచానికే దిక్సూచి
నిర్మల్చైన్గేట్: భారత దేశ విధానాలు ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనపై జిల్లా కేంద్రంలో బుధవారం ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ పాలనలో దళిత నేత, గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి కట్టబెట్టిన విషయాన్ని గుర్తు చే శారు. కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేసినందునే భారత్ ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థికశక్తిగా అవతరించిందని పేర్కొన్నా రు. కార్యక్రమంలో నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, అంజుకుమార్రెడ్డి, రాజు, రాజేశ్వర్రెడ్డి, కమల్నయన్, అర్జు న్, సాగర్, పోశెట్టి, కార్తిక్, సుష్మారెడ్డి, లక్ష్మారె డ్డి, వెంకటరెడ్డి, శ్రావణ్, రాజేందర్, నారాయణరెడ్డి, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ఖిల్లా/నిర్మల్ రూరల్: దాదాపు 50రోజుల వేసవి సెలవుల అనంతరం నేడు బడిగంట మోగనుంది. ఇన్నాళ్లు సెలవులను ఎంజాయ్ చేసిన వి ద్యార్థులంతా ఇక పాఠశాల బాట పట్టనున్నారు. జి ల్లాలో ఇటీవల నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1,150 మంది విద్యార్థులు నూతనంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశం పొందారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మొదటిరోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించేందుకు అంతా సిద్ధం చేశారు. జిల్లాలో 48,874 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చదువుకుంటున్నా రు. వీరికి ఒక్కోజత యూనిఫామ్ కోసం ప్రభుత్వం ఇప్పటికే వస్త్రం సరఫరా చేసింది. 96శాతం యూని ఫామ్ కుట్టు పనులు పూర్తయినట్లు సంబంధిత అధి కారులు తెలిపారు. మరో మూడురోజుల్లో పూర్తిస్థాయిలో అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే పార్ట్–1లో భాగంగా జిల్లాకు 3,27,110 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటికే 3,19,999 ఆయా మండలాలకు చేరుకున్నాయి. పార్ట్–2 పుస్తకాలు ఆగస్టులో రానున్నట్లు సమాచారం.
సిద్ధమైన పాఠశాలలు
జిల్లాలోని పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలలను అందంగా అలంకరించి పునఃప్రారంభానికి సిద్ధం చేశా రు. విద్యార్థులు గురువారం నుంచి బడిలో అడుగి డుతున్న సందర్భంగా పలుచోట్ల వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిరోజే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులతోపాటు యూనిఫాంలు పంపిణీ చేయనున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్యను అందించేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో చదివి ప్ర స్తుతం ఉన్నతంగా ఎదిగిన జిల్లాకు చెందిన పలు వు రు అధికారులు వేసవి సెలవుల అనంతరం తొలిరో జు బడికి వెళ్లిన అనుభవాలు పంచుకున్నారు.
న్యూస్రీల్
నేటి నుంచి పునఃప్రారంభం
సిద్ధమవుతున్న విద్యార్థులు
ముస్తాబైన ప్రభుత్వ స్కూళ్లు
నేడే పాఠ్యపుస్తకాల పంపిణీ
జిల్లాలోని పాఠశాలల వివరాలు
ప్రభుత్వ పాఠశాలలు 836
ప్రైవేట్ పాఠశాలలు 211
బాలురు 27,953
బాలికలు 34,094
మొత్తం 62,047
ప్రభుత్వ ఉపాధ్యాయులు 3,467
‘సర్కారు’లోనే చదివి డాక్టర్నయ్యా
నిర్మల్ఖిల్లా: చిన్నప్పటి నుంచి ప్రభుత్వ బడిలోనే చదివాను. సెలవుల తర్వాత బడికి వెళ్లాలంటే సంతోషమనిపించేది. కొత్త పుస్తకాలు, కొత్త బట్టలు, కొత్త చెప్పులు కొత్త తరగతి ఇలా అన్నీ కొత్తవే కావడంతో సంబురమనిపించేది. ఇప్పటికీ పాఠశాల తొలిరోజు జ్ఞాపకాలు గుర్తొస్తే మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతుంది.
– అప్పాల చక్రధారి, చిన్నపిల్లల వైద్యుడు, నిర్మల్
సర్కారు బడి పిలుస్తోంది
సర్కారు బడి పిలుస్తోంది
సర్కారు బడి పిలుస్తోంది
సర్కారు బడి పిలుస్తోంది
సర్కారు బడి పిలుస్తోంది
సర్కారు బడి పిలుస్తోంది
సర్కారు బడి పిలుస్తోంది
సర్కారు బడి పిలుస్తోంది