కోల్‌కతా సమీపంలో కాల్పులు.. సువేందు అధికారి పీఏ హత్య | Suvendu Adhikari Personal Secretary Shot Dead Near Kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతా సమీపంలో కాల్పులు.. సువేందు అధికారి పీఏ హత్య

May 6 2026 11:59 PM | Updated on May 7 2026 12:21 AM

Suvendu Adhikari Personal Secretary Shot Dead Near Kolkata

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు(పీఏ) చంద్రనాథ్ రాథ్ హత్యకు గురయ్యారు. కోల్‌కతా సమీపంలోని మధ్యంగ్రాంలో జరిగిన ఈ ఘటనలో చంద్రనాథ్ రాథ్‌పై రెండు సార్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అతనితో పాటు ఉన్న బుద్ధదేవ్ అనే వ్యక్తి గాయపడ్డాడు. దాంతో బుద్ధదేవ్‌ను ఆసుపత్రికి తరలించారు.  

ఈ సంఘటన బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన రెండు రోజులకే చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మధ్యంగ్రాం నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి రథిన్ ఘోష్, ఇతను బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాడు. ఆయన 2,399 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.  

తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అనుచరులుగా నటిస్తూ హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో సువేందు అధికారి, భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడించి 'జెయింట్ కిల్లర్' అనే పేరును సంపాదించారు. దాంతో సువేందు అధికారిని ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. ఈ హత్య ఘటనతో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement