ఈ పార్లమెంటు సమావేశాలు.. విజయోత్సవాలు | Parliament Monsoon Session PM Modi Likely To Address Media | Sakshi
Sakshi News home page

ఈ పార్లమెంటు సమావేశాలు.. విజయోత్సవాలు

Jul 21 2025 9:58 AM | Updated on Jul 22 2025 5:30 AM

Parliament Monsoon Session PM Modi Likely To Address Media

ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణన

హింసపై రాజ్యాంగ విజయానికి ప్రతీక

పార్లమెంటు ఆవరణలో ప్రధాని వ్యాఖ్యలు

ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు సిద్ధమంటూ సంకేతం

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జాతికి విజయోత్సవాలుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘బాంబులు, తుపాకులు అవి పుట్టించే హింసపై ఎప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తిదే పై చేయి. మా పాలనలో పదేపదే నిరూపితమవుతూ వస్తున్న వాస్తవమిది’’ అని మోదీ చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌తో సహా విపక్షాలు లేవనెత్తదలచిన అన్ని అంశాలపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడారు. 

‘‘ఇవి దేశానికి గర్వకారణంగా నిలవనున్న సమావేశాలు. విజయో త్సవాల వంటివి. మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించింది. సైన్యం 100 శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను సాధించి భారత పతాకను సమున్నతంగా ఎగురవేసింది’’ అని ఆపరేషన్‌ సిందూర్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘‘ఆ ఘనతను అఖిలపక్ష బృందాలు దేశదేశాల్లో చాటాయి. ఆ పార్టీలకు, ఎంపీలకు నా అభినందనలు’’అన్నారు. సిందూర్‌ వేళ మేడిన్‌ ఇండియా ఆయుధాలు అద్భుతంగా సత్తా చాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement