
ముంబై: ముంబైలో వరుసగా మూడవ రోజు సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
Be it an epidemic, a storm, bad weather or heavy rains, Mumbai Police officers and soldiers are always ready to help the common people, Salute Mumbai Police.❤️❤️🙏🏻🙏🏻🙏🏻#Mumbaipolice pic.twitter.com/2mfoh3NiCM
— Krishna Kant Mishra (@KKMishraOffice) August 18, 2025
దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా పలు రోడ్లు జలమయం అయ్యాయి. అంధేరి సబ్వే , లోఖండ్వాలా కాంప్లెక్స్ తదితర లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
🚨 Dadar majorly waterlogged.. 🔴
Avoid unnecessary travel in Mumbai!
Flashfloods in many parts of Mumbai after consistent heavy rains 🌊⚠️ pic.twitter.com/XF1pZ6FaXi— Mudassir Goenka (@MudassirGoenka7) August 18, 2025
సబర్బన్ రైళ్లు 15 నుండి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైతో పాటు సమీప జిల్లాలైన థానే, రాయ్గడ్లలో మంగళవారం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముంబై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి దృశ్యమానత తగ్గిందని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని వాహనదారులు తెలిపారు. వర్షం కారణంగా పలు రోడ్లు నీట మునిగాయి.
అంధేరి సబ్వే, లోఖండ్వాలా కాంప్లెక్స్ ప్రాంతాలలో నీరు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ముంబై జీవనాధారంగా పరిగణించే సబర్బన్ రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నట్లు అధికారులు, ప్రయాణికులు తెలిపారు. శనివారం నుండి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుండి వర్షాల తీవ్రత మరింత పెరిగిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.