గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఏర్పాటు చేయండి | MP Komatireddy Venkat Reddy Meets PM Narendra Modi In Delhi | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఏర్పాటు చేయండి

Aug 5 2023 4:46 AM | Updated on Aug 5 2023 8:10 AM

MP Komatireddy Venkat Reddy Meets PM Narendra Modi In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ టు విజయవాడ జాతీయరహదారి(65)లో మల్కాపూర్‌ నుంచి విజయవాడ వరకు ఉన్న స్ట్రెచ్‌ను గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేగా చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. అత్యంత రద్దీ ఉన్న ఈ రూట్‌లో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతున్న పరిస్థితులను దష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలోని ప్రైవేట్‌ యూనివర్సిటీల దోపిడీ ఎక్కువైందని, ఈ విద్యాసంస్థలపై సీబీఐ, ఈడీ, ఇతర సంస్థలతో విచారణ చేయించాలని ప్రధాని మోదీని కోమటిరెడ్డి కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధానిని కలిసిన సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement