ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత | MLC Kavitha Got Sick At Tihar Jail Moves To AIIMS For Treatment | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత, ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు

Aug 22 2024 12:51 PM | Updated on Aug 22 2024 3:26 PM

MLC Kavitha Got Sick At Tihar Jail Moves To AIIMS For Treatment

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్లై, తిహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థకు గురయ్యారు. దీంతో జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు అధికారులు తరలించారు. అక్కడ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే కవిత గైనిక్‌ సమస్యలు, వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆమె తిహార్‌ జైలులో శిక్షననుభవిస్తున్న విషయం తెలిసిందే. లిక్కర్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరిగ్ నేరారోపణలతో సీబీఐ, ఈడీ కేసుల్లో మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు.

ఇక గతంలోనూ ఒకసారి కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.

మరోవైపు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. 

కవితకు మరోసారి అస్వస్థత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement