సాక్షి,చెన్నై: తమిళనాడు కాంచీపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హ్యుందాయ్ కార్ల షోరూంలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
అగ్నికీలల్లో కార్లు,సామాగ్రి దగ్ధమయ్యాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. పదుల సంఖ్యలో మొహరించిన ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చినప్పటికీ భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.


