‘కోవిషీల్డ్‌ ఉత్పత్తిని 120 మిలియన్‌ డోసులకు పెంచుతాం’ | Mansukh Mandaviya Says Production Capacity Of Covishield Increase To 120 Million Doses In Rajya Sabha | Sakshi
Sakshi News home page

‘కోవిషీల్డ్‌ ఉత్పత్తిని 120 మిలియన్‌ డోసులకు పెంచుతాం’

Aug 3 2021 5:19 PM | Updated on Aug 3 2021 5:33 PM

Mansukh Mandaviya Says Production Capacity Of Covishield Increase To 120 Million Doses In Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్‌ నాటికి కోవిడ్‌ టీకాల ఉత్పత్తి పెంచుతామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు.  పార్లమెండ్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం కోవిడ్‌ టీకాలపై రాజ్యసభలో మంత్రి మన్‌సుఖ్‌ వివరణ ఇచ్చారు. ఈ సదర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోవిషీల్డ్‌ ఉత్పత్తిని నెలకు 120 మిలియన్‌ డోసులకు పెంచుతామని తెలిపారు.

కొవాగ్జిన్‌ ఉత్పత్తిని నెలకు 58 మిలియన్‌ డోసులకు పెంచుతామని చెప్పారు. ఈనెల నుంచే టీకాల ఉత్పత్తి పెంపు ప్రారంభం అవుతుందని వెల్లడించారు. కోవిడ్‌ వ్యాక్సిన్ల అభివృద్ధికి 'మిషన్‌ కోవిడ్‌ సురక్ష' కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనట్లు మంత్రి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement