
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు.. షిండే ప్రొఫైల్కు యాక్సెస్ అయ్యి, పాకిస్తాన్, టర్కీ జాతీయ జెండాల ఫొటోలను షేర్ చేశారు. ఈ కార్యకలాపాలు అటు షిండే అనుచరులు, పార్టీ వర్గాలను కలవరపెడుతున్నాయి. ఈ అనధికార పోస్ట్లను తొలగించే ముందు కొద్ది కాలం పాటు ఫొటోలను లైవ్లో ఉంచిన షిండే కార్యాలయ అధికారులు.. సైబర్ ఎటాక్ను త్వరగా గుర్తించామని, ఖాతాను సురక్షితంగా ఉంచేందుకు వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించామని తెలిపారు.
ఆసియా కప్లో భారత్- పాక్లు తమ రెండవ మ్యాచ్ ఆడబోతున్న(ఆదివారం) రోజున హ్యాకర్లు రెండు ఇస్లామిక్ దేశాల ఫొటోలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ‘మేము సైబర్ క్రైమ్ పోలీసులను వెంటనే అప్రమత్తం చేశాం. సమస్య పరిష్కారం అయ్యింది’ అని ఒక అధికారి తెలిపారు. ఈ ఖాతాను క్రమబద్ధీకరించేందుకు 30 నుండి 45 నిమిషాల సమయం పట్టిందని ఆ అధికారి తెలిపారు. సాంకేతిక బృందం ఆ ఖాతాని తిరిగి స్వాధీనం చేసుకున్నదన్నారు. ఖాతా ఇప్పుడు సాధారణంగానే పనిచేస్తోందని, ఈ ఘటనలో ఎటువంటి సున్నితమైన సమాచారం తరలిపోలేదన్నారు.