Karnataka assembly elections 2023: మోదీ, రాహుల్‌ను చూసి నేర్చుకోండి! | Karnataka assembly elections 2023: Priyanka Gandhi to PM over his remarks on abuse | Sakshi
Sakshi News home page

Karnataka assembly elections 2023: మోదీ, రాహుల్‌ను చూసి నేర్చుకోండి!

May 1 2023 5:54 AM | Updated on May 1 2023 5:54 AM

Karnataka assembly elections 2023: Priyanka Gandhi to PM over his remarks on abuse - Sakshi

జంఖాండి: కాంగ్రెస్‌ నేతలు తనను 91 సార్లు దూషించారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. ‘‘వాటన్నింటినీ కలిపినా ఒక పేజీ అవుతాయేమో. కానీ మీరూ, బీజేపీ నేతలూ మా కుటుంబాన్ని తిట్టిన తిట్లన్నీ రాస్తే పుస్తకాలే కూడా చాలవు! ఆమె ఆదివారం కర్ణాటకలోని బాగల్‌కోటె జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు.

దేశం కోసం తూటాలకు ఎదురొడ్డటానికి సిద్ధంగా ఉన్న తన సోదరుడు రాహుల్‌ గాంధీని చూసి నేర్చుకోవాలని మోదీకి సలహా ఇచ్చారు. ‘‘ప్రజాజీవితంలో ఉన్నవారు విమర్శలకు సిద్ధపడాలి. కాంగ్రెస్‌ తరఫున ప్రధానులుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం తూటాలు తిన్నారు. కానీ ప్రజల కష్టాలను వినడానికి బదులు వారికి సొంత బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోసం పాకులాడుతున్న మొట్టమొదటి ప్రధాని మోదీయే’’ అంటూ ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement