హమాస్ చీఫ్ సిన్వర్‌ మృతిని ధృవీకరించిన ఇజ్రాయెల్ | Israel Confirms Killing New Hamas Chief Mohammed Sinwar In May 13 Strike, Check Post Inside | Sakshi
Sakshi News home page

హమాస్ చీఫ్ సిన్వర్‌ మృతిని ధృవీకరించిన ఇజ్రాయెల్

Jun 1 2025 9:46 AM | Updated on Jun 1 2025 12:21 PM

Israel Confirms Killing New Hamas Chief Mohammed Sinwar

గాజా: గాజాలో మే 13న జరిగిన వైమానిక దాడిలో హమాస్ సీనియర్ నేత మొహమ్మద్ సిన్వర్(Mohammad Sinwar) మృతిచెందాడని ఇజ్రాయెల్‌ ధృవీకరించింది. గాజాలోని ఖాన్ యూనిస్‌లోని ఒక ఆసుపత్రి కింద ఉన్న భూగర్భ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. ఈ దాడుల్లో సిన్వర్‌ మృతిచెందట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) ధృవీకరించాయి.

ఐడీఎఫ్‌  తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్‌ సమన్వయంతో యూరోపియన్ హాస్పిటల్ కింద ఉన్న భూగర్భ హమాస్ కమాండ్, నియంత్రణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. కాగా గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో తన సోదరుడు యాహ్యా సిన్వర్ ,సైనిక కమాండర్ మొహమ్మద్ దీప్‌లు మృతిచెందిన  అనంతరం మహ్మద్ సిన్వర్ హమాస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఇజ్రాయెల్‌పై దాడులకు ప్లాన్ చేయడంలో, వాటిని అమలు చేయడంలో సిన్వర్  కీలక పాత్ర పోషించాడని ఐడీఎఫ్ పేర్కొంది.
 

మే 13న జరిగిన దాడుల్లో హమాస్‌కు చెందిన మరో ఇద్దరు ఉన్నత స్థాయి నేతలు కూడా మృతిచెందారని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ వీరి మృతిని ధృవీకరించినప్పటికీ, హమాస్ ఈ వాదనలను అంగీకరించడం గానీ, తిరస్కరించడం గానీ చేయలేదు. కాగా హమాస్‌ను పూర్తిగా నిర్మూలించే వరకూ వరకు తమ సైనిక కార్యకలాపాలు ఆగవని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: COVID-19: పిల్లలను స్కూళ్లకు పంపొద్దు: కర్నాటక ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement