ఐపీఎల్ 2026 ఫైనల్ : ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ | IPL 2026 Final Western Railway Announces Special Mumbai Ahmedabad Trains | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ 2026 ఫైనల్ : ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

May 30 2026 5:54 PM | Updated on May 30 2026 6:14 PM

IPL 2026 Final Western Railway Announces Special Mumbai Ahmedabad Trains

హోరా హోరీగా సాగిన ఐపీఎల్ 2026 ఫైనల్  దశకు  చేరింది. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఫైనల్‌ మ్యాచ్ కౌంట్‌డౌన్ స్టార్ట్‌ నేపథ్యంలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ రైల్వేస్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వెస్ట్రన్ రైల్వే ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.

మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సూపర్‌ ఫైట్‌ను ఈ చూసేందుకు వేలాది మంది అభిమానులు అహ్మదాబాద్‌కు  తరలివెళ్లనున్నారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జరిగే రోజున ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్‌కు ప్రత్యేక ఏసీ సూపర్‌ఫాస్ట్ రైలు నడపనున్నారు.

ట్రైన్ నంబర్ 09021: మే 31న ఉదయం 6:20 గంటలకు ముంబై సెంట్రల్‌లో బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 12:40 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. మ్యాచ్ రోజునే ప్రయాణించాలనుకునే అభిమానులకు ఇది చాలా అనుకూలమైన ఆప్షన్.

ఈ రైలులో ప్రీమియం శతాబ్ది తరహా రేక్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, ఏసీ చైర్ కార్, అనుభూతి క్లాస్, మరియు విస్టాడోమ్ కోచ్‌లు కూడా ఉంటాయి.

రిటర్న్ సర్వీస్ (ట్రైన్ నంబర్ 09022): ఇది అహ్మదాబాద్‌లో మధ్యాహ్నం 3:10 గంటలకు బయలుదేరి, రాత్రి 9:45 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.

ఫైనల్ మ్యాచ్  ముగిసాక అదనపు సర్వీసులు
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, వెస్ట్రన్ రైల్వే జూన్ 1న మరో రెండు అదనపు ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేసింది.

ట్రైన్ నంబర్ 09044: అహ్మదాబాద్ నుండి బాంద్రా టెర్మినస్ వరకు నడుస్తుంది.

ట్రైన్ నంబర్ 09043: అదే రోజు రాత్రి బాంద్రా టెర్మినస్ నుండి వాటివా (Vatva) వరకు నడుస్తుంది.

ప్రత్యేకతలు: ప్రీమియం ఏసీ రైళ్లతో పోలిస్తే, ఈ రైళ్లలో ఏసీ త్రీ-టైర్ మరియు స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. బడ్జెట్ ప్రయాణికులకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.

రైలు ఆగే స్టేషన్లు 
ఈ ప్రత్యేక రైళ్లు ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లోని పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో బోరివలి, వాపి, సూరత్, భరూచ్ మరియు వడోదర ఉన్నాయి. దీనివల్ల వివిధ నగరాల నుండి ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉంటుంది.

బుకింగ్స్‌  ఎలా అంటే..
ఈ నాలుగు ప్రత్యేక సర్వీసుల బుకింగ్స్ మే 30 నుండి ప్రారంభమవుతాయి. టిక్కెట్లను ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా లేదా పీఆర్‌ఎస్ (PRS) రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ఐపీఎల్ ఫైనల్ వీకెండ్ కారణంగా భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ఖరారు చేసుకునే ముందు పూర్తి టైమ్‌టేబుల్ మరియు కోచ్ వివరాలను తనిఖీ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. 

కాగా  టైటిల్‌కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) తలపడనున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement