నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు | Know Some Interesting Facts About Fourth Phase 2024 Elections, Details Inside | Sakshi
Sakshi News home page

Facts About 4th Phase Elections: నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు

May 13 2024 8:04 AM | Updated on May 13 2024 9:47 AM

Interesting Facts About Fourth Phase 2024 Elections

2024 లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ మొదలైపోయింది. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానానికి ఓటింగ్ జరుగుతుంది.

నాలుగో దశ ఎలక్షన్స్ 2024 - ఆసక్తికర విషయాలు

  • లోక్‌సభ నాలుగవ దశ ఎన్నికలలో మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. పోల్ ప్యానెల్ ప్రకారం, 96 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తం 4,264 నామినేషన్లు దాఖలయ్యాయి.
  • తెలంగాణ (1,488) నుంచి అత్యధికంగా నామినేషన్ పత్రాలు అందాయని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 25 నియోజకవర్గాల నుంచి 1,103 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల సంఘం తెలిపింది.
  • ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచినట్లు ఎన్నికల సంఘం ఆదివారం వెల్లడించింది.
  • ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్‌లో ఇది మొదటి ప్రధాన ఎన్నికలు.
  • బీజేపీ నేతృత్వంలోని NDA లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో పోలింగ్ జరగనున్న 96 స్థానాల్లో 40కి పైగా ఎంపీలు ఉన్నారు.
  • కన్నౌజ్ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్, బీహార్), నిత్యానంద్ రాయ్ (ఉజియార్‌పూర్, బీహార్), రావుసాహెబ్ దాన్వే (జల్నా, మహారాష్ట్ర ఉన్నారు.
  • మహారాష్ట్రలోని బీజేపీకి చెందిన పంకజా ముండేతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్‌లో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ విజయం కోసం పోటీ పడుతున్నారు.
  • నాలుగో దశలో పోలింగ్ జరగనున్న పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, పోలింగ్ రోజున ఈ ప్రాంతాల్లో వేడిగాలులు వీచే పరిస్థితులు ఉండవని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
  • 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి మూడు దశల్లో ఓటింగ్ శాతం వరుసగా 66.14 శాతం, 66.71 శాతం, 65.68 శాతంగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement