బెంగాల్‌లో హైటెన్షన్: 15 బూత్‌లలో కొనసాగుతున్న రీపోలింగ్ | High Stakes Repolling Grips Bengal Amid | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో హైటెన్షన్: 15 బూత్‌లలో కొనసాగుతున్న రీపోలింగ్

May 2 2026 7:15 AM | Updated on May 2 2026 8:08 AM

High Stakes Repolling Grips Bengal Amid

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశలో  అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, సౌత్ 24 పరగణాల జిల్లాలోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం 7 గంటలకు ఆయా పోలింగ్‌​ బూత్‌లలో రీపోలింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 29న జరిగిన ఓటింగ్‌లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, ఈవీఎంలను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేయడం లాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్నికల సంఘం పాత పోలింగ్‌ను రద్దు చేసింది. మగ్రాహట్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రత్యేక ఈవీఎంలపై ఉన్న పార్టీ గుర్తులను టేపులతో దాచిపెట్టారనే ఆరోపణలు స్థానిక ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే స్పెషల్ అబ్జర్వర్ల నివేదిక ఆధారంగా, పకడ్బందీ భద్రతా నడుమ శనివారం సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.

రీపోలింగ్ వ్యవహారం అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రీపోలింగ్ నిర్ణయాన్ని బీజేపీ వర్గాలు స్వాగతిస్తూనే, మరింత ఎక్కువ బూత్‌లలో అక్రమాలు జరిగాయని, వెంటనే అక్కడ కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేసింది. మరోవైపు, టీఎంసీ నేతలు మాత్రం ఎన్నికల సంఘం తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంపై, పనితీరుపై తీవ్ర అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేశారు. ఎలాంటి కనీస పారదర్శకత లేకుండా, తమ పార్టీ ఏజెంట్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపించారు. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య చెలరేగిన పరస్పర ఆరోపణలతో బెంగాల్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

 

Advertisement
 
Advertisement
Advertisement