విమాన ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌ | Heavy Fog Disrupts Flights Across Northern India | Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌

Dec 15 2025 10:16 AM | Updated on Dec 15 2025 12:04 PM

Heavy Fog Disrupts Flights Across Northern India

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విజిబులిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర భారతదేశానికి భారీ పొగమంచు అలర్ట్‌ జారీ చేసింది. 

అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని విమానాలు మార్గం మళ్లించబడ్డాయి. విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. 

ఉత్తర భారతదేశంలో శీతాకాలం తీవ్రత పెరగడంతో పొగమంచు మరింతగా అలుముకుంటోంది. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రోజుల్లో కూడా పొగమంచు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement