Coronavirus: పెరిగిన కొత్త కేసులు, రికార్డు స్థాయిలో మరణాలు

Coronavirus: 94052 New Covid Cases Registered In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా  94,052 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 2,91,83,121కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో రోజువారీ కరోనా మరణాల సంఖ్య 6148కు పెరిగింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,59,676 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో 1,51,367 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,76,55,493  మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 11,67,952 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 20,04,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 37,21,98,253 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 23,90,58,360 మంది కరోనా వాక్సిన్‌ అందించారు.

చదవండి: పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top