కరోనా కల్లోలం: భారత్‌లో కొత్తగా 47,704 కేసులు | Corona Update: New 47704 Positive Cases Registered In India | Sakshi
Sakshi News home page

కరోనా కల్లోలం: భారత్‌లో కొత్తగా 47,704 కేసులు

Jul 28 2020 9:00 AM | Updated on Jul 28 2020 11:07 AM

Corona Update: New 46357 Positive Cases Registered In India - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి వేగంగా విస్తరిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, మరణాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,704 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 654 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,83,157కు చేరింది. ఇప్పటి వరకు 33,425 మంది మృత్యువాత పడగా.. 9,52,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. సోమవారం మొత్తం 5,28,082 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. (14 లక్షలు దాటేశాయ్‌..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement