సమాచారం ఇచ్చాం..
విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావడంతో జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఈ బూచి వ్యాప్తి చెందకుండా ఆదిలోనే అంతం చేయాల్సి ఉంది. గతంలో ప్రారంభించిన ప్రహరీ క్లబ్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాల్సి ఉంది. అందుకు ఉపాధ్యాయుల సహకారం పూర్తిగా ఉంటుంది.
– యశ్వంత్, జిల్లా అధ్యక్షుడు, ఎస్ఎల్టీఏ
●
నషా ముక్త్ విద్యాల యా నినాదంతో ఏర్పా టు చేస్తున్న ప్రహరీ క్లబ్లను ఈ ఏడాది పకడ్బందీగా నిర్వ హించనున్నాం. ఇప్పటికే విద్యాలయాలకు సమాచారం అందించాం. కమిటీ వివరాలతో పాటు డిక్లరేషన్ను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్లో సమర్పించాలని సూ చించాం. ఈ నెల 30లోగా పూర్తి చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ఎంఈఓల ద్వారా వేగవంతం చేయిస్తున్నాం.
– రాజేంద్రకుమార్, సీఎంఓ


