జిల్లాలో 160 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఈ నెల రెండో వారంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం. రైతులకు ఇబ్బందులు కలగకుండా సరిపడా గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. – సైదులు,
డీఎం, పౌరసరఫరాల సంస్థ, నారాయణపేట
●


