
లోక్ అదాలత్లో 5,583 కేసుల పరిష్కారం
నారాయణపేట: జిల్లాలోని 14 పోలీస్స్టేషన్లు, రెండు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 5,583 కేసులను జాతీయ లోక్అదాలత్లో పరిష్కరించారు. శనివారం జిల్లా న్యాయ సేవా సంస్థ, లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, చైర్మన్ బోయ శ్రీనివాసులు, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, జూనియర్ సివిల్ జడ్జి మమతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్లో జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో 5,583 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. కేసుల పరిష్కారానికిగాను రూ.26,52,800 ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ప్రధాన న్యాయమూర్తి తెలియజేశారు.