
నాణ్యమైన విద్యే లక్ష్యం
జిల్లాలోని అన్ని ప్రభు త్వ పాఠశాలలో వి ద్యార్థులకు నాణ్య మైన విద్యను అందించడమే కాకుండా పాఠశాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించాం. విద్యా శాఖ క్యాలెండర్ ప్రకారం బోధన జరుగుతుంది. గతంలో వివిధ పాఠశాలల్లో ప్రారంభమైన పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. గత నెల రోజులుగా మిగితా అన్ని పాఠశాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పనులు తుది దశకు చేరుకున్నాయి. మౌళిక సౌకర్యాలైన తాగునీరు కల్పించి టాయిలెట్స్ వినియోగంలోకి తెస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖాళీల స్థానంలో సర్దుబాటు జరుగుతుంది. పుస్తకాలు, యూనిఫామ్స్ మొదటిరోజే అందిస్తాం.
– గోవిందరాజులు, డీఈఓ
●