
తండ్రి బ్యాంకు ఉద్యోగి.. కొడుకు ఐఏఎస్
వెల్దండ మండలం పోషమ్మగడ్డతండాకు చెందిన వడ్యావత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించారు. ఎస్బీఐలో ఉద్యోగిగా పనిచేస్తూ పిల్లలను ఉన్నతంగా చదివించేందుకు కష్టపడ్డారు. పెద్ద కుమారుడు యశ్వంత్నాయక్ రెండో ప్రయత్నంలో 2024లో 627 ర్యాంక్ సాధించి ఐపీఎస్ సాధించారు. మహారాష్ట్ర ఐపీఎస్ కేడర్కు ఎంపికై హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతూనే మళ్లీ ఐఏఎస్ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే యశ్వంత్నాయక్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో 433 ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికయ్యారు.