ఎంపీడీఓలుగా ఇద్దరికి పోస్టింగ్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంపీడీఓలుగా ఇద్దరికి పోస్టింగ్స్‌

Jun 1 2026 4:13 AM | Updated on Jun 1 2026 4:13 AM

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌/ మండల పరిషత్‌ కార్యాలయాల్లో పరిపాలనాధికారులుగా విధులు నిర్వహిస్తు ఇటీవలే ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన ఇద్దరికి ఆదివారం మండలాలు కేటాయిస్తూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులను అందించారు. జెడ్పీ ఏఓగా పనిచేస్తున్న కేవీ నాగేంద్రప్రసాద్‌ను ఎంపీడీఓగా మద్దికెరకు, ఆత్మకూరు మండల పరిషత్‌ కార్యాలయ ఏఓ సయ్యద్‌ ఉమర్‌ను హొళగుంద ఎంపీడీఓగా నియమించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించడంలో ఎంపీడీఓలు ముందుండాలని, పారదర్శకంగా విధులు నిర్వహించాలని కోరారు. జెడ్పీలోని చైర్మన్‌ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement