
అభివృద్ధి పనులకు రూ.2.50 కోట్లు మంజూరు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.2.50కోట్లు మంజూరైనట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ లడ్డూ కౌంటర్ తయారీ బిల్డింగ్, నాలుగు గెస్ట్హౌస్ల నిర్మాణం, నూతన పరిపాలనా కార్యాలయ భవనం, అదనంగా భక్తుల సౌకర్యార్థం 50గదుల నిర్మాణానికి తాజాగా ప్రతిపాదనలు పంపామన్నారు. అన్నదానం కోసం జీప్లస్ బిల్డింగ్ నిర్మాణానికి ఇప్పటికే రూ.2.30కోట్ల నిధులు మంజూరు కాగా రివైజింగ్ కోసం పంపినట్లు వెల్లడించారు. మంజూరైన అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.