మల్లన్న సన్నిధిలో భక్తులు చల్లన | - | Sakshi
Sakshi News home page

మల్లన్న సన్నిధిలో భక్తులు చల్లన

Oct 19 2025 6:33 AM | Updated on Oct 19 2025 6:33 AM

మల్లన్న సన్నిధిలో భక్తులు చల్లన

మల్లన్న సన్నిధిలో భక్తులు చల్లన

శ్రీశైలంటెంపుల్‌: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా స్వామివారి దర్శనం అనంతరం బయటికి వచ్చిన తరువాత మల్లికాగుండం నుంచి అమ్మవారి ఆలయం వరకు రూ.60లక్షల నిధులతో టెంజైన్‌ ఫ్యాబ్రికేషన్‌ చేశారు. భక్తులు నడిచేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో గతంలో రేకులు ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడేవారు. రేకులను తొలగించి టెంజైన్‌ ఫ్యాబ్రికేషన్‌ ఏర్పాటు చేశారు. దీంతో ఎండకు , వానకు ఇబ్బందులు లేకుండా భక్తులకు చల్లగా ఉంటుంది. అలాగే కోతుల బెడద కూడా లేకుండా ఉంటుంది. శివరాత్రి, ఉగాది ఉత్సవాల్లో సైతం అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేసే అవసరం ఉండదు.

వీబీఆర్‌లో 16 టీఎంసీల నీరు

వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (వీబీఆర్‌)లో 16.443 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు ఏఈ శివనాయక్‌ తెలిపారు. బానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి వెలుగోడు జలాశయానికి తెలుగుగంగ కాల్వ ద్వారా 6,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. వీబీఆర్‌ నుంచి చైన్నె ప్రధాన కాల్వకు 6000, వనన్‌ఆర్‌ తూముకు 60, వన్‌్‌ ఎల్‌ తూముకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

ఆర్టీసీలో అప్రెంటీస్‌కు

దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల(వ్యవసాయం): నంద్యాల జిల్లాలోని ఏపీఎస్‌ ఆర్టీసీ అప్రెంటిషిప్‌ ఐటీఐ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ కర్నూలు శిక్షణా కళాశాల సిబ్బంది నజీర్‌ అహమ్మద్‌ శనివారం తెలిపారు. ఈనెల 25 నుంచి నవంబర్‌ 8వ తేదీలోపు www.apprenticeshipindian.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో డీజల్‌ మెకానిక్‌ 32, మోటారు మోకానిక్‌ 4, ఎలక్ట్రీషియన్‌ 4, వెల్డర్‌ 1, పెయింటర్‌ 1, డ్రాప్స్‌మెన్‌ సివిల్‌ 1 చొప్పున ఖాళీగా ఉన్నాయని వారు తెలిపారు. వెరిఫికేషన్‌ కోసం ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలను కర్నూలు శిక్షణ కళాశాలలో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 08518–257025ను సంప్రదించాలన్నారు.

క్లాప్‌ మిత్రల సంక్షేమంపై దృష్టి సారించండి

కర్నూలు(అర్బన్‌): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య పనులు చేపడుతున్న క్లాప్‌ మిత్రల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పరిషత్‌ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో జిల్లాలోని ఎంపీడీఓలకు ఎల్‌ఎస్‌డీజీఎస్‌ థీమ్‌ – 5 ( క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ) అనే అంశంపై టీఓటీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అర్హులైన క్లాప్‌ మిత్రలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బీమా భద్రత, సంక్షేమ పథకాలు, పీఎంఎస్‌బీవై, చంద్రన్న బీమా, ఈ శ్రమ్‌, ఎన్‌టీఆర్‌ భరోసా అందేలా చూడాలన్నారు. ప్లాస్టిక్‌ అధిక వినియోగంతో మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతోందన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయాల దిశగా అడుగులు వేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వాడకం వల్ల వచ్చే వ్యాధులు, జరిగే నష్టాలపై అవగాహన కలిగించాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీపీఆర్‌సీ కోఆర్డినేటర్‌ మంజులావాణి, ట్రైనింగ్‌ మేనేజర్‌ గిడ్డేష్‌, టీఓటీలు ఆస్రఫ్‌ బాషా, పి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులో

టీటీడీ క్యాలెండర్లు

కర్నూలు కల్చరల్‌: తిరుమల తిరుపతి దేవస్థానముల పంచాంగం క్యాలెండర్లు, డైరీలు విక్ర యానికి అందుబాటులో ఉన్నాయని టీటీడీ కల్యాణ మండపం మేనేజర్‌ సి.రామ్మోహన్‌ తెలిపారు. కర్నూలు సీ.క్యాంప్‌ టీటీడీ కల్యాణ మండపంలో తగినన్ని క్యాలెండర్లు, డైరీలు విక్రయానికి అందుబాటులో ఉంచామన్నారు. పెద్ద డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120, 12 సీట్స్‌ క్యాలెండర్‌ రూ.130, తెలుగు పంచాంగం క్యాలెండర్‌ రూ.30, టేబుల్‌ క్యాలెండర్‌ రూ.75, శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో కూడిన క్యాలెండర్‌ రూ.20, శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు కలిసి ఉన్న క్యాలెండర్‌ రూ.15, ఆరుషీట్స్‌ డిజిటల్‌ క్యాలెండర్‌ రూ.450 ధరలతో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement