● చిన్న వర్షానికి కోతకు గురైన చిన్నపొదిళ్ల–గుండాల రోడ్డు ● రూ.3.80 కోట్లు మట్టిపాలు ● ఈ నెల 11న రోడ్డును ప్రారంభించిన డోన్‌ ఎమ్మెల్యే ● 12వ తేదీన కొట్టుకుపోయిన రహదారి | - | Sakshi
Sakshi News home page

● చిన్న వర్షానికి కోతకు గురైన చిన్నపొదిళ్ల–గుండాల రోడ్డు ● రూ.3.80 కోట్లు మట్టిపాలు ● ఈ నెల 11న రోడ్డును ప్రారంభించిన డోన్‌ ఎమ్మెల్యే ● 12వ తేదీన కొట్టుకుపోయిన రహదారి

Jun 14 2025 10:28 AM | Updated on Jun 14 2025 10:28 AM

● చిన

● చిన్న వర్షానికి కోతకు గురైన చిన్నపొదిళ్ల–గుండాల రోడ్డ

నగు‘బాట’

మా ప్రభుత్వంలో రోడ్లు వేస్తున్నామనిపించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 20 రోజుల్లో తారుపోసి చేతులు దులుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ‘కోట్ల’ హడావుడిగా ప్రారంభంచేసి గొప్పలు చేసుకున్నారు. తీరాచూస్తే.. ఒక్కరోజుకే ఆ రోడ్డు కాస్తా ‘తారు’లేచిపోయింది.

ప్యాపిలి: రహదారులు గ్రామాల అభివృద్ధికి చిహ్నాలు. అలాంటి రహదారుల నిర్మాణంలో కూటమి నేతల జోక్యంతో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తునానరు. చిన్నపొదిళ్ల నుంచి గుండాల వరకు 4 కిలో మీటర్ల మేర రూ. 3.80 కోట్లు వెచ్చించి గత నవంబర్‌లో రోడ్డు పనులు ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు నిర్మాణం విషయంలో అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కేవలం 20 రోజుల వ్యవధిలో రోడ్డు నిర్మాణం పూర్తి చేశారంటే ఎంత మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారో అర్థం చేసుకోవచ్చు. ఈ రోడ్డును ఈ నెల 11న డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డి ప్రారంభించారు. 12వ తేదీ తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్డు పూర్తిగా కోతకు గురికావడంతో పాటు ఆ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా ఛిద్రమైంది. విషయం తెలుసుకున్న అధికారులు తమ తప్పును కప్పిపుచ్చేందుకు రోడ్డుపై పడిన గుంతలను మట్టితో పూడ్చారు. రోడ్డు కోతకు గురైన ప్రదేశంలో దగ్గరలోనే కల్వర్టు ఉంది. అయితే కాంట్రాక్టర్‌తో పాటు అధికారులు ఈ కల్వర్టులోకి వర్షం నీరు వెళ్లే ఏర్పాటు చేయలేదు. దీంతో కల్వర్టులోకి వర్షం నీరు వెళ్లే మార్గం లేక ఆ నీరు ఒక్కసారిగా రోడ్డుపై ప్రవహించాయి. నాసిరకంగా వేసిన రోడ్డు ప్రవాహ వేగానికి కోతకు గురైంది. రోడ్డుపై నుంచి పారిన వర్షపు నీరు అటు వైపు ఉన్న పొలాల్లోకి చేరడంతో పొలాలు కోతకు గురయ్యాయి. వర్షం వస్తే పంటలు సాగు చేసేందుకు పొలాలను సిద్ధంగా ఉంచుకున్న రైతులుఆందోళన చెందుతున్నారు. కోతకు గురైన తమ పొలాలను ఎలా పూడ్చుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం తమకు శాపంలా మారిందని వాపోతున్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో వేసిన రోడ్లు పదిలం..

గత వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నాణ్యత విషయంలో అధికారులతో తరచూ రివ్యూ మీటింగ్‌లు నిర్వహిస్తూ, ఆకస్మిక తనిఖీలు చేస్తూ స్వయంగా నాణ్యతను పరిశీలించారు. నిర్మాణం నాసిరకంగా ఉన్నట్లు తన దృష్టికి వస్తే తిరిగి నాణ్యతగా నిర్మించేలా చూశారు. అందుకే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేసిన ఒక్క రోడ్డు కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ రోడ్లను అప్పట్లో టీడీపీ నాయకులు తమలపాకులా రోడ్లు వేశారని ఎద్దేవా చేశారు. ఒక్క వర్షానికే కొట్టుకుపోతున్న రోడ్లను ఏ ఆకుతో పోల్చుకుంటారో టీడీపీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నామని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వం మాటలకు.. చేతలకు పొంతన లేకుండా పోతోంది. కోట్లాది రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని హడావుడి చేసి చివరకు నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్‌ రెడ్డి ఘనంగా ప్రారంభించిన రోడ్డే మరుసటి రోజు వర్షానికి కొట్టుకుపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పూసిన తారు చెదిరిపోయి.. నాసిరకం కంకర కొట్టుకుపోయి.. రోడ్డు కోతకు గురైంది. కొత్త రోడ్డు అందుబాటులోకి వచ్చిందని ముచ్చట పడిన గ్రామస్తులకురెండు రోజుల్లో గుంతల రోడ్డు దర్శనమిచ్చింది.

● చిన్న వర్షానికి కోతకు గురైన చిన్నపొదిళ్ల–గుండాల రోడ్డ1
1/2

● చిన్న వర్షానికి కోతకు గురైన చిన్నపొదిళ్ల–గుండాల రోడ్డ

● చిన్న వర్షానికి కోతకు గురైన చిన్నపొదిళ్ల–గుండాల రోడ్డ2
2/2

● చిన్న వర్షానికి కోతకు గురైన చిన్నపొదిళ్ల–గుండాల రోడ్డ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement