
సజావుగా డీఎస్సీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో డీఎస్సీ – 2025 పరీక్షలు సజావుగా జరుతున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం సెషన్–1లో ఇంగ్లిష్, ఎస్జీటీ పరీక్షలు జరిగాయన్నారు. ఉదయం జరిగిన పరీక్షకు 870 మందికి గాను 811 మంది హాజరు కాగా 59 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 871 మందికి గాను 855 మంది హాజరు కాగా 26 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
పాండురంగాపురం సందర్శన
నంద్యాల(అర్బన్): జాతీయ నిర్మల్ గ్రామ పురస్కార్, శుభ్రం అవార్డు, టూరిజం ఎక్సలెంట్ అవార్డులను పొందిన నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామాన్ని బీహార్ రాష్ట్రం సర్పంచ్ల బృందం శుక్రవారం సందర్శించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్) కోచ్ అంజన్కుమార్ బంజ్యా ఆధ్వర్యంలో సర్పంచ్ల బృందం గ్రామంలోని తాగునీటి వసతి, ఎస్హెచ్సీ గ్రూప్, రైతు సంఘాలు, గ్రామ పంచాయతీ కార్యాలయం, తదితరాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పాండురంగస్వామి దేవాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను కొనియాడారు. గ్రామంలో ఏర్పాటు అయిన విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లు, ప్రజలకు అవసరమైన సదుపాయాలపై సర్పంచ్లు అభివృద్ధిని ప్రశంసించారు. ఎస్హెచ్జీ గ్రూపు ద్వారా పచ్చళ్లతో పలువురికి ఉపాధి కల్పించడాన్ని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ డోలావతమ్మ, ఎంపీటీసీ లక్ష్మి, మాజీ సర్పంచ్ ఉమామహేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పురుషోత్తమరెడ్డి, కొండా మోహన్రెడ్డి, ఎంపీడీఓ సుగుణశ్రీ, ఈఓఆర్డీ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ లింకు తప్పనిసరి
కర్నూలు(అర్బన్): తల్లికి వందనం నిధులు విడుదల కాని ఎస్సీ విద్యార్థులు పోస్టల్/బ్యాంకు ఖతాలకు ఎన్పీసీఐ లింకు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమం సాధికారత అధికారిణి కె.తులసీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటి వరకు 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి 930 మంది తల్లుల ఎన్పీసీఐ మ్యాపింగ్ పెండింగ్లో ఉందన్నారు. అలాగే 2,129 మంది ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఎన్పీసీఐ కూడా పెండింగ్లో ఉందన్నారు. ఎస్సీ విద్యార్థులకు సింగిల్ బ్యాంకు అకౌంట్ మాత్రమే ఉండాలని, అది కూడా విద్యార్థి ఆధార్ లింకు ఉన్న బ్యాంకు అకౌంట్కే తల్లికి వందనం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 16లోగా పూర్తి చేయాలన్నారు.