అభ్యర్థులు ఖర్చు చేయాల్సింది ఇంతే | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థులు ఖర్చు చేయాల్సింది ఇంతే

Nov 27 2025 7:41 AM | Updated on Nov 27 2025 7:41 AM

అభ్యర్థులు ఖర్చు చేయాల్సింది ఇంతే

అభ్యర్థులు ఖర్చు చేయాల్సింది ఇంతే

అభ్యర్థులు ఖర్చు చేయాల్సింది ఇంతే

సర్పంచ్‌కు రూ.2.50 లక్షలు

వార్డు సభ్యుడికి రూ.50 వేలు

భువనగిరి టౌన్‌ : పంచాయతీరాజ్‌ చట్టంలోని 237(3)ల ద్వారా సర్పంచ్‌, వార్డు సభ్యులు ఎన్నికల ఖర్చును నిర్ణయించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మేరకు ఖర్చు చేయవచ్చనే విషయాన్ని నిర్ణయించారు. ఎన్నికల్లో పారదర్శకత, సమతుల్యాన్ని కాపాడేందుకు ఈ ఖర్చు పరిమితిని విధించారు. గ్రామ పంచాయతీలోని ఓటర్ల సంఖ్యను బట్టి సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఖర్చు పరిమితులు నిర్ణయించారు.

ఫ 5వేలకు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే సర్పంచ్‌ అభ్యర్థులు ఎన్నికల్లో గరిష్టంగా రూ. 2.50 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. వార్డు సభ్యడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.50వేలు ఖర్చు చేసేందుకు వీలుంది.

ఫ 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో పోటీ చేసే సర్పంచ్‌ అభ్యర్థులు ఎన్నికల్లో రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. వార్డు సభ్యడిగా పోటీ చేసేవారు రూ.30 వేల వరకు ఖర్చ చేయవచ్చు. ఈ నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల ఖర్చు లెక్కలను కూడా పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement