
కాంగ్రెస్కు పట్టున్న ప్రాంతం నల్లగొండ
మునుగోడు: నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుందని ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బిశ్వరంజన్ మహంతి అన్నారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం గురువారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి చాలా చిన్నదన్నారు. ఆయనకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. రాజగోపాల్రెడ్డి ఆవేదన, కోరికను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా తాము పూర్తి మద్దతు ఇస్తామని రాజగోపాల్రెడ్డి, కార్యకర్తలు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు కె.శంకర్నాయక్, నాయకులు పాల్గొన్నారు.