
విదేశాలకు డ్రై వెజిట బుల్స్
బొమ్మలరామారం: హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మురళీరాజ్ డ్రై వెజిటబుల్స్(ఆరబెట్టిన కూరగాయలు)ను విదేశాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. అంతేకాకుండా సోలార్ డ్రైయర్ యూనిట్లను స్వయంగా తయారుచేస్తూ డ్రై వెజిటబుల్ వ్యాపారం చేసేందుకు ఆసక్తి గల రైతులకు విక్రయిస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు. బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామ శివారులో 16ఎకరాల భూమిని మురళీరాజ్ కౌలుకు తీసుకొని సోలార్ డ్రైయర్ వెజిటబుల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న పలు రకాల కూరగాయలతో పాటు మార్కెట్లో లభించే పండ్లను సైతం సోలార్ వెజిటబుల్ డ్రైయర్ యూనిట్లో ఆరబెట్టి స్థానిక మార్కెట్లో విక్రయించడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా తాను సోలార్ డ్రైయర్లు విక్రయించిన రైతుల వద్ద ఆరబెట్టిన కూరగాయలను కూడా సేకరించి యూరప్లోని జర్మనీ, నార్వే, స్పెయిన్, రష్యా దేశాలతో పాటు గల్ఫ్ దేశాలైన టర్కీ, కువైట్, ఒమన్, సౌదీలకు ఎగుమతి చేస్తున్నారు. అదేవిధంగా పర్వతారోహణ చేసే వారి కోసం హిమాలయాల వరకు సైతం ఈ డ్రై వెజిటబుల్ వ్యాపారం విస్తరించింది. ప్రధానంగా అల్లంవెల్లుల్లి, మునగాకు, మునగకాయలు, ఉసిరి, అరటి, టమాట, ద్రాక్ష పండ్లను ఎగుమతి చేస్తున్నారు.
బహుళ ప్రయోజనకారిగా యూనిట్లు
కూరగాయలు సాగుచేస్తున్న రైతులకు సోలార్ డ్రైయర్ యూనిట్లు లాభసాటిగా మారాయి. ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేసి, మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉండడంతో రైతులకు ధర గిట్టుబాటు కాక అప్పులపాలైన సంఘటన చాలా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, తక్కువ విస్తీర్ణంలో సాగు లాంటి కారణాలతో కొన్ని సమయాల్లో కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఇలాంటి సమయాల్లో సోలార్ డ్రైయర్ యూనిట్ను ఏర్పాటు చేసుకుని ఆ యూనిట్లో కూరగాయలు, పండ్లను ఆరబెట్టి భద్రపరచడంతో ఆరు నెలల వరకు ఈ డ్రై వెజిటబుల్స్ను వాడుకోవచ్చు. ఇలా చేయడం వలన రైతులు నష్టాలబారిన పడకుండా, వినియోగదారులకు అధిక ధరల సెగ తగలకుండా ఉంటుంది.
పోషకాల లోపం ఉండదు
వెజిటబుల్స్ను 40–50 డిగ్రీల మధ్యనే ఆరబెట్టడంతో పోషకాల లోపం ఉండదని మురళీరాజ్ పేర్కొంటున్నారు. క్యాటరింగ్ చేసే వ్యక్తులు, హోటల్స్ నిర్వాహకులు, ఎన్ఆర్ఐలకు ఈ డ్రై వెజిటబుల్స్ఉపయోగకరంగా ఉంటున్నాయి. కూరగాయలతో పాటు పండ్లు, అన్నిరకాల మాంసహార ఉత్పత్తులను సైతం సోలార్ డ్రైయర్లో ఆరబెట్టి నిల్వ చేసుకోవచ్చు.
ప్రభుత్వం చేయూతనివ్వాలి
సోలార్ వెజిటబుల్ డ్రైయర్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి కెపాసిటీని బట్టి రూ.75వేల నుంచి రూ.2లక్షలకు పైగా ఖర్చవుతుంది. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే చాలా మంది కూరగాయల రైతులకు మేలు జరుగుతుంది. కూరగాయల సాగు చేస్తున్న రైతుల్లో డ్రై వెజిటబుల్స్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకు 40 మంది రైతులు తన నుంచి సోలార్ డ్రైయర్లను కొనుగోలు చేసినట్లు మురళీరాజ్ పేర్కొన్నారు. చాలామంది రైతులు తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సోలార్ డ్రైయర్ వెజిటబుల్ యూనిట్లను సందర్శించి, తమకు కూడా యూనిట్లను తయారు చేసి ఇవ్వాలని కోరుతున్నారని ఆయన తెలిపారు.
ఫ ఆరబెట్టిన కూరగాయలను గల్ఫ్, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్న ఔత్సాహిక రైతు మురళీరాజ్
ఫ నాగినేనిపల్లిలో 16 ఎకరాల్లో
సోలార్ డ్రైయర్ యూనిట్ల ఏర్పాటు
ఫ ఆసక్తి గల రైతులకు సోలార్ డ్రైయర్ యూనిట్లు అందజేసి ప్రోత్సాహం
డిమాండ్ అధికంగా ఉంది
రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నాను. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు సోలార్ డ్రైయర్లో ఆరబెట్టిన కూరగాయలను సేకరించి విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నాం. గల్ఫ్, యూరప్ దేశాల్లో డ్రై వెజిటేబుల్స్కు మంచి డిమాండ్ ఉంది. పర్వతారోహకులు ఎక్కువ బరువు గల కూరగాయలను తమతో తీసుకెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుంది. వారి సౌలభ్యం కోసం డ్రై వెజిటేబుల్స్ అందిస్తున్నాం.
– మురళీరాజ్, నాగినేనిపల్లి

విదేశాలకు డ్రై వెజిట బుల్స్

విదేశాలకు డ్రై వెజిట బుల్స్